Friday 12 January 2018

దేశభక్తి కవిసమ్మేళనo – అంశం : “ అమర జవాన్లకు అక్షరాంజలి ”

దేశభక్తి కవిసమ్మేళనo – అంశం :         “ అమర జవాన్లకు అక్షరాంజలి  ”


దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
తెలంగాణ రాష్ట్రము
PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL
Telangana State, INDIA ( Regd.no.446/2014)
( www.patriotswelfaresociety.blogspot.com )

మంచిర్యాల జిల్లా కవులకు ఇదే మా ఆహ్వానం. మా మొట్టమొదటి దేశభక్తి కవి సమ్మేళనంలో పాల్గొనండి. మీ దేశభక్తిని కవితా రూపంలో వినిపించండి.

అంశం :         “ అమర జవాన్లకు అక్షరాంజలి  ”
తేది:               జనవరి    28,2018 ( ఆదివారం )
 సమయం :    ఉదయం  10 a.m. -1 p.m.
స్థలం :             ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల

        రిపబ్లిక్ దినోత్సవం ను పురస్కరించుకొని జవాన్ల  యొక్క సేవలను, త్యాగాలను పౌర సమాజం స్మరించడం ఎంతైనా అవసరం అనే ఉద్దేశ్యంతో ఈ కవి సమ్మేళనం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశభక్తి కవి సమ్మేళనం లో అధిక సంఖ్యలో కవులు , సాహితి ప్రియులు పాల్గొని వారి అంతరంతరంగాలలో ఉన్న దేశభక్తిని కవిత రూపంలో తీసుకు వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు అందించబడును. కవులు కూడా వారి కవిత యొక్క ప్రతిని మాకు అందించగలరు. వాటిని ఈ-పుస్తకం రూపంలో తీసుకు వస్తాము. ఈ కార్యక్రమoలో పాల్గొనే వారు సంప్రదించండి.
గమనిక : ప్రతి కవికి ౩-5 నిమిషాల సమయం యివ్వడం జరుగుతుంది. కవుల సంఖ్య ఆదారంగా సమయం ఉంటుoది.

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
సెల్ : 9440383277
Whastapp : 7386776361


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.